పెళ్లికి ముందే రకుల్-జాకీ ఏడడుగులు!

రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. మొదట్లో చాటు మాటు వ్యవహారాలు నెరిపినా తర్వాత రివీల్ కాక తప్పలేదు. ప్రస్తుతం ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఖాళీ సమయం దొరికితే విదేశాలు చెక్కేస్తున్నారు. అదీ కుదరకపోతే భారత్ లోనే విహార యాత్రల్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే జంటగా మాల్దీవుల అందాల్ని ఆస్వాదించి వచ్చారు.

తాజాగా ఆగ్రా కోటల్ని చుట్టేస్తున్నారు. అయితే ఈసారి ప్రేమికులుగా సహచరుల పెళ్లికి జంట అతిధులుగా హాజరయ్యారు. బాలీవుడ్ దర్శకుడు లూ రాంజాన్స్ – అలీ వేదిల వివాహం ఫిబ్రవరిలో 20న ఆగ్రాలోని ప్లుష్ హోటల్ లో నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా జంట ఆహ్వానం మేరకు రకుల్ -జాకీ కూడా జంటగానే హాజరయ్యారు.

ఇద్దరూ వైట్ అండ్ వైట్ డిజైనర్ దుస్తుల్లో కొత్త జంటని తలపిస్తు న్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తున్న ఓ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసిన నెటి జనులు పెళ్లికి ముందే జంటగా ఒకరి వేలు మరొకరు పట్టుకుని ఏడు అడుగులు వేసేసారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రేమికుల్లా కాకుండా పెళ్లైన కొత్త జంటగా హాజరైనట్లు ఉందని అంటున్నారు.

ఇలా వైట్ అండ్ వైట్ ధరించడం డ్రెస్ కోడ్ లా కనిపిస్తోంది. ఆ పక్కనే మరో మహిళ కూడా తెలుపు రంగు డిజైన్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఆ కారణంగానే మ్యారేజ్ డ్రెస్ కోడ్ లా కనిపిస్తోంది. ఇక కెరీర్ పరంగా ఇద్దరు బిజీ గానే ఉన్నారు. రకుల్ నటిగా బిజీగా ఉంది. జాకీ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ సక్సెస్ కాలేదు.

రెండేళ్లగా నటనకు దూరంగా ఉంటూ నిర్మాతగా బిజీ అయ్యాడు. ఇటీవల రిలీజ్ అయిన `బెల్ బాటమ్` చిత్ర నిర్మాతల్లో జాకీ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఐదారు సినిమాలు నిర్మిస్తున్నారు.