మరోసారి సీనియర్‌ స్టార్‌ హీరోతో జత కట్టబోతున్న రకుల్‌

సౌత్‌ లో ముఖ్యంగా తెలుగులో సమంత ప్రాభవం కోల్పోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ రెండు ఆఫర్లు దక్కించుకుంది. గత రెండు సంవత్సరాలుగా పెద్దగా ఆఫర్లు లేకుండా ఉన్న ఈమెకు ఒకేసారి క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో మరియు నితిన్‌ హీరోగా నటిస్తున్న చెక్‌ సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతాననే నమ్మకంతో ఈ అమ్మడు ఎదురు చూస్తుంది. ఈ సమయంలోనే ఈ అమ్మడు మరో సినిమాను బాలీవుడ్‌లో చేసే అవకాశం దక్కించుకుంది.

గత ఏడాది అజయ్‌ దేవగన్‌ హీరోగా రూపొందిన దేదే ప్యార్‌ దే సినిమాలో రకుల్‌ నటించింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అజయ్‌ మరియు రకుల్‌ మద్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈసమయంలోనే ఈ అమ్మడు మరో సినిమాను ఆయనతో చేసేందుకు కమిట్‌ అయ్యింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మే డే అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఈ సినిమాను అజయ్‌ దేవగన్‌ నిర్మించడంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. అమితాబచ్చన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సౌత్‌ లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాని ఈసమయంలో బాలీవుడ్‌ నుండి వచ్చిన ఈ అవకాశంను ఎంత వరకు ఈ అమ్మడు సద్వినియోగం చేసుకుంటుంది అనేది చూడాలి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో రకుల్‌ సెటిల్‌ అయ్యేనా చూడాలి.