రష్మికను విపరీతంగా మోసేస్తున్న హీరోగారు..!

కన్నడ నుంచి తెలుగులో అడుగుపెట్టింది రష్మిక మందన. ఇప్పుడు తమిళంలోనూ అడుగుపెట్టింది. తదుపరి హిందీలో పెద్ద స్టార్ అయిపోతోంది. తెలుగు- తమిళ- కన్నడ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక వెలిగిపోతోంది. తెలుగులో `పుష్ప` లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీలో నటిస్తూనే ఇదే ఏడాది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ `మిషన్ మజ్ను`. శంతను బగ్చి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇండియా – పాకిస్థాన్ మధ్య సాగిన సీక్రెట్ మిషన్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని రోనీ స్క్రూవాలా..అమర్ బూటాలా..సుమిత్ భతేజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తొలి సినిమా రిలీజ్కి ముందే హీరోయిన్ గా ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రష్మికపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సౌత్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలతో భారీ రెమ్యూనిరేషన్ ని తీసుకుంటూ చేతినిండా ఛాన్సులతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా దృష్టిని పెట్టింది. కెరీర్ మీద ఫుల్ కాన్సన్ ట్రేషన్ చేసిన రష్మిక ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రతీ అవకాశాన్ని తన ఎదుగుదలకు మెట్లుగా వాడుకుంటోంది. బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందు కోసం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

కెరీర్ పరంగా ఎక్కడ పరిమితంగా వుండాలనే ఆలోచనతో తాను ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ క్రమంలో బాలీవుడ్ అవకాశాన్ని కూడా ఒడిసి పట్టింది. ఈ అమ్మడి టైమ్ కూడా అలా కలిసి వస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న రష్మిక హిందీలోకి ఎంట్రీ ఇవ్వడానికి గోల్డెన్ ఆఫర్ ని సొంతం చేసుకుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న `మిషన్ మజ్ను`తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే “షేర్షా` సినిమాతో దేశ వ్యాప్తంగా మరింత గుర్తింపుకు నోచుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

బాలీవుడ్ లో ఇప్పుడు మంచి ఊపు మీదున్న సిద్ధార్థ్ మల్హోత్రా సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో.. రష్మికను ఆకాశానికెత్తేశాడు సిద్ధార్థ్. ఆమెను ఒక రేంజ్ లో ప్రశంసించాడు. ఆమె అత్యంత ప్రతిభావంతమైన నటి అని అన్నాడు. రష్మికతో జత కట్టడం తనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చిందన్నాడు. తమ పెయిర్ తెరపై చాలా ఫ్రెష్ గా ఉంటుందని కూడా సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ఇలా బాలీవుడ్ లో తన తొలి సినిమాలో పని చేసిన హీరో ఈ రేంజ్ లో ప్రశంసించడంతో రష్మిక ఉబ్బితబ్బిబ్బయిపోతోంది.

ఈ ప్రశంసలు ఆమెకు మరిన్ని అవకాశాలకు బాట వేస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. సౌత్ నుంచి వెళ్లి ముంబైలో అవకాశాలని వెతుక్కుంటున్న రష్మికకు సిద్ధార్థ్ వంటి హీరో ప్రశంసలు అక్కడ ఆమె పాగా వేయడానికి ఎంతో ఉపకరిస్తాయి. `మిషన్ మజ్ను` తో పాటు తాజాగా రష్మిక మరో బంపర్ ఆఫర్ ని సొంతం చేసుకుంది. అదే `గుడ్ బై` ఈ సినిమాలో కూడా నటిస్తోంది రష్మిక. ఇందులో విశేషం ఏంటంటే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మిక ఆయనకు కూతురిగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. రెండవ చిత్రమే బిగ్ బీతో నటించే అవకాశం రావడంతో రష్మిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సిద్ధార్ధ్ మాటలు విన్న వాళ్లంతా బాలీవుడ్ లో కూడా రష్మిక మాయాజాలం స్టార్టయిందని కామెంట్ లు చేస్తున్నారు.