రష్మిక సెన్సేషనల్ కామెంట్స్.. పంది మాంసం, రెండు పెగ్గుల వైన్!

చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుని టాప్ రేంజ్ కు చేరుకుంది రష్మిక మందన్న. ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్ ను అందుకున్న రష్మిక అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్పలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ సినిమా ఆడాళ్ళూ మీకు జోహార్లు చిత్రంలో కూడా నటిస్తోంది.

ఇదిలా ఉంటే మెగా కోడలు ఉపాసన URLife పేరిట నిర్వహించే షో కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసింది రష్మిక. ఈ షో లో తన ఆచార్య వ్యవహారాలు, ఆహార పద్దతుల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఈ షో లో భాగంగా ఆరోగ్యమైన, పౌష్టికాహార వంటకాలను ఎలా చేయాలో చెబుతుంది ఉపాసన.

తాజా ఎపిసోడ్ లో రష్మిక గెస్ట్ కాగా ఆమె కోలీ పుట్టు కూరను వండింది. కోడిని కోర్గిలో కోలి అంటారని రష్మిక చెప్పగానే ఉపాసన మీరు కోర్గీ సామజిక వంశానికి చెందిన వారా? మీరు ఎక్కువగా పంది మాంసం తింటారు కదా అని అనగానే రష్మిక అవునని సమాధానం చెప్పింది. పంది మాంసం మా సాంప్రదాయ వంటకమని తెలిపింది. అలాగే మా ఇళ్లల్లో వైన్ ను సొంతంగా చేసుకుంటామని, కచ్చితంగా రాత్రి పడుకునే ముందు రెండు పెగ్గుల వైన్ తాగుతామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మిక.