ఉత్తరాదికి ప్రయాణమైన క్రేజీ సౌత్ ముద్దుగుమ్మ

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు కన్నడంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న ప్రాజెక్ట్‌ లతో బిజీ బిజీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాదిలో ఈమె నటించిన అయిదు ఆరు సినిమాలు సౌత్ ఆడియన్స్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రష్మక మందన్నా మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సౌత్‌ లోనే సందడి చేస్తున్న ఈ అమ్మడు ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతుంది.

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్ర కొత్త సినిమా మిషన్‌ మజ్ను లో హీరోయిన్‌ గా రష్మిక మందన్నాను హీరోయిన్‌ గా ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే టెస్టు షూట్‌ కూడా జరిగిందని అంటున్నారు. శాంతను బగ్చి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది. క్రేజీ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్‌ లో బిజీ అయ్యేనా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ లో ఈమె బిజీ అయితే సౌత్‌ సినిమాలను తగ్గిస్తుందేమో అని కూడా అంటున్నారు.