ఎట్టకేలకు ఊరట… రియాకు బెయిల్ మంజూరు

డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి ఎట్టకేలకు ఊరట లభించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో ఇరుకున్న విషయం తెల్సిందే. సుశాంత్ కు డ్రగ్స్ అందించారన్న కారణంతో రియా చక్రవర్తి, తన సోదరుడు శౌయిక్ చక్రవర్తిలను నార్కోటిక్స్ బృందం అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే.

విచారణలో భాగంగా కొన్ని సాక్ష్యాధారాలను కూడా నార్కోటిక్స్ అధికారులు పొందినట్టు వార్తలు వస్తున్నాయి. రియా ఇప్పటికే పలు మార్లు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకోగా అన్నీ రిజెక్ట్ అయ్యాయి. ఇటీవలే ఎన్డీపీఎస్ కోర్టు రియా చక్రవర్తి కస్టడీను అక్టోబర్ 21 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే బొంబాయి హై కోర్టు ఈరోజు రియాకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1 లక్ష రూపాయల పూచికత్తుపై ఆమెకు బెయిల్ మంజూరైంది. అయితే రియా సోదరుడు శౌయిక్ కు మాత్రం బెయిల్ రిజెక్ట్ అయింది.