సర్కారు వారి పాట సీక్రెట్ గా వీక్షించిన సాయి పల్లవి

సాయి పల్లవి చేసినవి తక్కువ సినిమాలే అయినా సూపర్ స్టార్ డం సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా గార్గితో మన ముందుకు రానున్న సాయి పల్లవి రీసెంట్ గా సర్కారు వారి పాటను సీక్రెట్ గా చూసింది.

హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో సాయి పల్లవి నిన్న రాత్రి కనిపించింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎవరికీ తెలీకుండా సినిమా వీక్షించింది కానీ మీడియా తిరిగి వచ్చేస్తుంటే ఆమెను పట్టేసింది. ఇంకేముంది కెమెరాల్లో క్లిక్ మనిపించారు. ఇక మహేష్ బాబు అభిమానులేమో చూసారా సాయి పల్లవి కూడా మహేష్ అభిమాని అని అంటున్నారు.

గతేడాది డిసెంబర్ లో తన చిత్రం శ్యామ్ సింగ రాయ్ ను కూడా ఇలాగె సీక్రెట్ గా అందరితో పాటు వీక్షించింది సాయి పల్లవి.