సమంత బాటలో మరో స్టార్ హీరోయిన్.!

కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. లాక్ డౌన్ వలన సినిమా రంగం పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కానీ ప్రస్తుతం ప్రేక్షకులు ఓటిటి ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎంటర్టైన్ అవుతున్నారు. ఆ రీచ్ చూసి కొన్ని చిన్న సినిమాలను డైరెక్ట్ గా ఓటిటిలోనే రిలీజ్ చేసేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఓటిటి రీచ్ ఎలా ఉందనేది. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం వెబ్ సీరీస్ లు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

లాక్ డౌన్ కంటే ముందే తెలుగు నుంచి మొదటగా సమంత అక్కినేని ‘ఫ్యామిలీ మాన్ 2’ అనే వెబ్ సీరీస్ కోసం సైన్ చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వలన కాజల్ అగర్వాల్, తాప్సి, నిత్య మీనన్ లాంటి తారలు ఇప్పటికే ఓటిటిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు వీరి జాబితాలో తాజాగా సౌత్ ఇండియన్ ఫేమస్ హీరోయిన్ త్రిష కూడా వచ్చి చేరింది.

తాజా సమాచారం ప్రకారం రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తండ్రి – కూతురు మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీ త్రిషకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. షూటింగ్స్ మొదలవ్వగానే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.