సర్కారు వారి పాట ఎడారి యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు. గీత గోవిందం వంటి చిన్న బడ్జెట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు పరశురామ్ ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహేష్‌ బాబు ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమా సెకండ్‌ షెడ్యూల్ కు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇటీవలే రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అయ్యింది కాని కరోనా వల్ల షూటింగ్‌ మద్యలోనే వాయిదా వేయడం జరిగింది. సర్కారు వారి పాట చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో వాయిదా వేయడం జరిగింది. ఈ సమయంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా లో ఒక ఎడారి యాక్షన్‌ సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశం కోసం దుబాయిలోని ప్రత్యేక సెట్ ను వేయడం జరిగింది. అందులో చేసిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది.