పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ల సినిమా మరో వారం రోజుల్లో మొదలు కానుంది. రామోజీ ఫిలిం సిటీలో విజయన్ నేతృత్వంలో ఒక ఫైట్ సీన్తో షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఈ చిత్రాన్ని ఎనభై రోజుల్లో పూర్తి చేస్తానని త్రివిక్రమ్ షెడ్యూల్ వేసి ఇచ్చాడట. మరో ఇరవై రోజుల బఫర్ పెట్టుకుని మొత్తం వంద రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసేయాలని అనుకుంటున్నారు.
ఇదిలావుంటే ఈ చిత్రంలో విలన్గా యువ నటుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు సమాచారం. సరైనోడు సినిమాలో విలన్గా నటించి మార్కులు కొట్టేసిన ఆది ఆ సినిమాతోనే త్రివిక్రమ్ దృష్టిలో పడ్డాడట. అతడిని దృష్టిలో పెట్టుకునే విలన్ క్యారెక్టర్ని రాసాడట. విలన్ క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుందని, ఆదికి ఈ చిత్రంతో పెద్ద బ్రేక్ వస్తుందని అంటున్నారు. ఇందులో పవన్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ ఎంపికయింది. మరో పాత్రకి అను ఎమాన్యుయేల్ని కన్సిడర్ చేస్తున్నారు.
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ దీంతో తెలుగులో అడుగుపెడుతున్నాడు. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు కాలేదని, పవన్ ఇమేజ్ని స్టడీ చేసి అందుకు అనుగుణమైన మ్యూజిక్ ఇవ్వడానికి అతను ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో పవన్ ఐటీ ప్రొఫెషనల్గా నటిస్తున్నాడనే పుకారు బాగా షికారు చేస్తోంది.
https://www.youtube.com/watch?v=DGT3YFZMEng