ఆడవాళ్లు మీకు జోహార్లు స్టేటస్ ఏంటి మరి?

శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఈ సినిమా మార్చ్ 4న డీసెంట్ రివ్యూలతో ఓపెన్ అయింది. అయితే కలెక్షన్స్ మాత్రం అంత ఆశాజనకంగా లేవు. తొలి వీకెండ్ తర్వాత ఈ చిత్రం పూర్తిగా డీలా పడింది. మొత్తంగా మొదటి వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం కేవలం 7.54 కోట్ల షేర్ ను మాత్రమే సాధించింది.

ఈ చిత్రానికి 16 కోట్ల వరకూ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే సగానికి సగం ఈ చిత్రం నష్టపోనుంది. ఈరోజు నుండి రాధే శ్యామ్ థియేటర్లలో సందడి చేస్తుండడంతో ఆడవాళ్లు మీకు జోహార్లు ఇక ఫుల్ రన్ దగ్గరకు చేరుకున్నట్లే.

మొత్తంగా శర్వానంద్ ఖాతాలో ఇది వరసగా ఆరో ప్లాప్. తన కెరీర్ ను ఒకసారి పునఃసమీక్షించుకోకుంటే మాత్రం శర్వా ఇబ్బందుల్లో పడటం ఖాయం. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.