‘మనం’ తరహా సినిమాతో యంగ్ హీరో హిట్ కొడతాడా?

‘పడిపడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’ సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ఆచి తూచి తన తదుపరి సినిమాలను ఎంచుకుంటున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ‘శ్రీకారం’ శర్వానంద్ నెక్స్ట్ రిలీజ్. అలాగే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తన తదుపరి సినిమా ఉండనుంది.

ఇది కాకుండా ఓ పీరియడ్ సినిమాని ఇప్పటికే ఓకే చేశారు.. విషయంలోకి వెళితే.. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి 19 నుంచి 2021 వరకూ జరిగే కథాంశంతో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ రూపొందించనున్నారు. ఈ సినిమా ‘మనం’ సినిమా తరహాలో ఉంటుందని, తెలుగు సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ప్రేమకథ అవుతుందని చందూ మొండేటి తెలిపారు. ఈ సినిమా లుక్స్ కోసం శర్వానంద్ ఫిజికల్ గా చాలా శ్రమించాల్సి వస్తుందని కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి తీసుకెళ్తున్నామని చందూ మొండేటి తెలిపారు.

‘మనం’ సినిమాకి తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ తరహాలో రూపొందించనున్న ఈ సినిమా కూడా శర్వానంద్ కెరీర్లో కావాల్సిన బిగ్ హిట్ ని ఇచ్చి మర్చిపోలేని సినిమాగా నిలిచిపోతుందో లేదో కాలమే చెప్పాలి. ప్రస్తుతం చందూ మొండేటి నిఖిల్ తో ‘కార్తికేయ 2’ అనౌన్స్ చేసారు. లాక్ డౌన్ అయ్యాక ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.