శిల్పాశెట్టి ఎమోషనల్.. భర్తతో వాగ్వాదం

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో అతడి భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్నారు. విచారణలో కుంద్రా శృంగారభరిత సినిమాలు తీస్తారే తప్ప అశ్లీల చిత్రాలు తీయరని తన వాంగ్మూలంలో వివరించింది. హాట్‌షాట్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే కంటెంట్‌పై తనకి అవగాహన లేదని, అందులో తన ప్రమేయం లేదని వెల్లడించింది. అయితే..

విచారణలో భాగంగా రాజ్ కుంద్రాను వెంటబెట్టుకొని జుహులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు సమాచారం. విచారణ సందర్భంగా పోలీసుల ముందు శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. ఈ కేసు వల్ల తమ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యిందని ఎమోషన్ అయినట్టు తెలుస్తోంది. తమ కెరీర్ కు సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్‌ క్యాన్సిల్‌ కావడంతో తాము తీవ్రంగా నష్టపోయామని శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ఇంటికి వచ్చిన కుంద్రాతో ఈ విషయమై శిల్పా వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తోంది.

ముంబై మేజిస్ట్రేట్ కోర్టు కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. కుంద్రా నివాసం, ఆఫీస్ లో దాదాపు 48 టెరాబైట్‌ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.