బాలయ్య సినిమాకు మళ్లీ మళ్లీ అదే సమస్య

తెలుగు ఇండస్ర్టీలో బాలకృష్ణ సీనియర్ హీరో. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న అఖండ మూవీకి హీరోయిన్ ను వెతికేందుకు చిత్ర యూనిట్ పెద్ద యాగమే చేసిందని చెప్పొచ్చు. చివరికి పెద్దగా క్రేజ్ లేని ప్రగ్యా జైస్వాల్ బాలయ్యతో సినిమా చేసేందుకు అంగీకరించింది. బాలయ్య లాంటి సీనియర్ హీరోతో స్ర్కీన్ ను షేర్ చేసుకుంటే మరలా యంగ్ హీరోల సరసన నటించేందుకు ఇబ్బంది అవుతుందనే కారణంతో ఈయన పక్కన సినిమాల్లో నటించేందుకు ముద్దుగుమ్మలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు కారణం అదే అయినా కానీ బ్యూటీలంతా దర్శకుల మనసు నొప్పించకూడదని ఏవో కారణాలు చెప్పి సినిమాలను మెల్లగా రిజెజ్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య చేస్తున్న అఖండ సినిమా కంప్లీట్ అయిన తరువాత మరో హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఓ సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఇందుకు సంబంధించిన కథను కూడా గోపీచంద్ మలినేని ఫైనల్ చేశాడని టాక్. ఇందులో హీరోయిన్ గా నటించమని విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ను దర్శకుడు సంప్రదించగా ఆమె సున్నితంగా నో చెప్పినట్లు సమాచారం. మరో విషయమేంటంటే గోపీచంద్ మలినేని కి సినిమాలో శృతి హాసన్ తప్పకుండా ఉండాలని సెంటిమెంట్. దానితోనే ఆయన తన నెక్స్ట్ మూవీలో బాలయ్య సరసన నటించమని అడగ్గా అందుకు శృతి నో చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నో అయితే చెప్పింది కానీ అందుకు చెప్పిన కారణం చూస్తేనే వామ్మో అని అనిపిస్తుంది. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. అందువల్ డేట్లు అడ్జెస్ట్ చేయలేనని చెప్పి చాక చక్యంగా తప్పించుకుందట. ఏ పేరు చెప్పినా బాలయ్య బాబుతో స్టార్ హీరోయిన్లు క్రేజ్ ఉన్న హీరోయిన్లు నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరని మళ్లీ నిరూపితం అయ్యిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కేవలం నయనతార వంటి స్టార్ డమ్ ఉన్న సీనియర్ హీరోయిన్లు మాత్రమే బాలయ్య బాబుతో స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు అంగీకరిస్తారు. కానీ నయనతార స్టార్ డమ్ వల్ల ఆమె ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అందువల్లే దర్శక నిర్మాతలు బాలయ్య బాబుతో నటించమని శృతి హాసన్ ను సంప్రదించగా ఆమె నో చెప్పింది. కానీ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఉన్న స్నేహం కారణంగా ఈ మూవీలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించేందుకు మాత్రం అంగీకరించిందట. సో… తదుపరి బాలయ్య బాబు సినిమాలో అందాల బొమ్మ శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించడం ఖాయమయిపోయిందని ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు.