అల్లు అర్జున్కి ముఖం మీద రాషెస్ వచ్చాయని, స్కిన్ అలర్జీతో బాధ పడుతున్నాడని మీడియాలో ఒక వర్గం ప్రచారం చేసింది. ఏదో ఒక కార్యక్రమానికి ముఖానికి మాస్క్ పెట్టుకుని రావడంతో అల్లు అర్జున్కి ఏదో అయిందని అనేసారు. అంతే కాకుండా దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ కూడా ఆగిపోయిందని, అల్లు అర్జున్ కోలుకున్నాక గానీ మళ్లీ ముందుకు కదలదని కూడా ప్రచారం చేసారు.
అయితే అల్లు అర్జున్కి ఏమీ కాలేదని, నిక్షేపంలా వున్నాడని అతని తాజా ఫోటోలు చూస్తేనే తెలుస్తోంది. కొడుకు బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి రెండు రోజులు షూగింగ్ నుంచి విరామం తీసుకున్న అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు గోవా వెళ్లాడు. అక్కడ ఎంజాయ్ చేస్తోన్న మూమెంట్స్ కొన్ని తన ఫాన్స్తో అల్లు అర్జున్ పంచుకున్నాడు.
ఈ ఫోటోల్లో అల్లు అర్జున్ భేషుగ్గా వున్నాడనేది తెలుస్తూనే వుంది. నిజంగా స్కిన్ అలర్జీనే అయితే అతను ఇంత త్వరగా కోలుకునే వాడు కాదు, అందులోను స్విమ్మింగ్ పూల్లో అస్సలు దిగేవాడు కాదు.
దీనిని బట్టి అప్పుడు వినిపించిన పుకార్లన్నీ ఎవరో పుట్టించిన పులిహోర కబుర్లేనని తేలిపోయింది. ఇలాంటివి ప్రచారం చేసే ముందు హీరో సన్నిహితులని కాంటాక్ట్ చేసి నిజమా, కాదా అని తెలుసుకుని న్యూస్ రాస్తే బెటర్.