శ్రీదేవి ఇంట కరోనా పాజిటివ్ నమోదు

హాలీవుడ్ వారితో పోల్చితే ఇండియన్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తక్కువే. ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు కూడా ఇది పాకుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. తాగాజా దివంగత శ్రీదేవి కుటుంబం ఇప్పుడు కరోనా భయంతో వణికి పోతుంది. ఎందుకు అంటే వారి ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… బోణి కపూర్ ఫ్యామిలీ తో పాటు ఉంటూ వారి ఇంటి పని చేసే చరణ్ సాహో అనే 21 ఏళ్ల యువకుడికి తాజాగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ముంబయి లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నా కూడా బాలీవుడ్ స్టార్స్ జాగ్రత్తగా ఉండటంతో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు చరణ్ సాహో వల్ల బోణి కపూర్ ఫ్యామిలి లో కరోనా కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

చరణ్ సాహో ని ఐసోలేషన్ కు తరలించిన అధికారులు ప్రస్తుతం బోణికపూర్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు పని వాళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బోణి కపూర్ తో పాటు ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు అదే ఇంట్లో ఉంటారు. ఆ కారణంగానే ఇప్పుడు అందరికి టెన్షన్ టెన్షన్ గా ఉంది. ఇటీవలే కపూర్ ఫ్యామిలీ చిన్న గెట్ టు గెదర్ కూడా అయ్యారట. మరి ఈ కాంటాక్ట్ ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతోంది.