ఆమె చేతిలోకి వెళ్లిన సుకుమార్ రైటింగ్స్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఒక వైపు వరుసగా సినిమాలు తెరకెక్కిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తన శిష్యులతో సినిమాలను నిర్మిస్తున్న సుకుమార్ ఇటీవల ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ బాధ్యతలను సుకుమార్ సన్నిహితుడు ప్రసాద్ నిర్వహించేవాడు. ఇటీవల ఆయన మృతి చెందడంతో సుకుమార్ రైటింగ్స్ బాధ్యతలను తనకు సన్నిహితులైన మరెవ్వరికైనా అప్పగించాలని భావించిన సుకుమార్ చివరకు తన భార్య చేతిలోనే ఆ బాధ్యతను పెట్టినట్లుగా తెలుస్తోంది.

సుకుమార్ భార్య తబిత లాండ్రీ బిజినెస్ తో పాటు ఇతర వ్యాపారాలను నిర్వహిస్తూ ఉన్నారు. కరోనా కారణంగా గత ఏడాది కాలంగా తబిత వ్యాపారం నిలిచి పోయింది. ఈ సమయంలోనే తబిత చేతిలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ను పెట్టినట్లుగా తెలుస్తోంది. సినిమా నిర్మాణంలో ఆమెకు అనుభవం లేకపోవడం వల్ల సుకుమార్ కొన్నాళ్ల పాటు ఆమె కు గైడెన్స్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం 18 పేజెస్ సినిమా ను గీతాఆర్ట్స్ 2 బ్యానర్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

కొత్త సినిమాలు కూడా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు మెల్లగా సాగుతూ ఉన్న సుకుమార్ రైటింగ్స్ సినిమాల నిర్మాణం స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. ఇక సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా తో బిజీగా ఉన్నాడు. తన నిర్మాణ సంస్థలో రూపొందబోతున్న సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ కూడా ఆయన చేస్తున్నాడు.