ఫోటో టాక్‌: పద్మాసనంలో మత్తెక్తిస్తున్న ముద్దుగుమ్మ

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత తెలుగమ్మాయి తేజస్వి మడివాడ టాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. ఒక వైపు హీరోయిన్‌ పాత్రలు చేస్తూ మరో వైపు చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ఆ సమయంలోనే తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 లో ఛాన్స్‌ దక్కించుకుంది. నటిగా వెండి తెర మరియు బుల్లి తెరపై బిజీగా ఉన్న ఈమె బిగ్‌ బాస్ కు వెళ్లడంతో కొంత మేలు కొంత నష్టం జరిగిందనే టాక్‌ ఉంది. అంతకు ముందు కంటే బిగ్‌ బాస్ వల్ల మంచి పాపులారిటీ అయితే పెరిగింది. కాని బిగ్‌ బాస్ వల్ల ఈమెకు బుల్లి తెరపై అడపా దడపా ఆఫర్లు అయితే వచ్చాయి కాని ఒక మంచి పొజీషన్‌ లో నిలబెట్టే సినిమా ఆఫర్‌ కాని బుల్లి తెర ఆఫర్‌ కాని రాలేదు. అయినా కూడా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

సోషల్‌ మీడియా ద్వారా ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షించేందుకు గాను ఈ అమ్మడు చేస్తున్న పని ఫొటో షేరింగ్‌. ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడు చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు రోజు రోజుకు అందాల విందును పెంచుతున్నాయి. ఇటీవల ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. పద్మాసనంలో కూర్చుని ఉన్న తేజస్వి తన అందాలతో మత్తెక్తిస్తోంది. క్లీవేజ్‌ షో తో పాటు తొడల అందం కూడా ఆమె ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. మొత్తానికి ఆమె సోషల్‌ మీడియా అభిమానులు ఫొటోకు లైక్స్‌ తో ముంచెత్తుతున్నారు.