సర్కారు వారి పాట: ఆగస్ట్ లో బుల్లెట్ దింపుతానంటోన్న థమన్

దాదాపు ఏడేళ్ల తర్వాత ఎస్ ఎస్ థమన్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పనిచేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు వంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు కూడా మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ స్టేటస్ ను అందుకున్నాయి. ఆగడు తర్వాత మళ్ళీ సర్కారు వారి పాట సినిమా కోసం థమన్ మహేష్ సినిమాకు పనిచేస్తున్నాడు.

ఇక మహేష్ అభిమానులు ఈ విషయంలో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న థమన్ తమ సినిమా కోసం ఎలాంటి సంగీతం ఇస్తాడో అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్ లో జరుగుతోన్న విషయం తెల్సిందే.

ఇక సోషల్ మీడియాలో థమన్ ను మహేష్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట షూటింగ్ గురించి అప్డేట్ అడగ్గా థమన్ దానికి ఇంకా సమయం ఉందిగా అని స్పందించాడు. ఆగస్ట్ నుండి సర్కారు వారి పాట అప్డేట్స్ ను ఆశించవచ్చు. ఈసారి బులెట్ గట్టిగా దింపుదాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు.