త్రిష ఆ వివాదాస్పద పోస్ట్‌ రానా గురించా?

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష తాజాగా సోషల్‌ మీడియాలో ఎవరైతే తమ మాజీ ప్రేయసిని స్నేహితురాలిగా భావిస్తున్నామని అంటారో వారు చాలా పెద్ద మోసగాళ్లు. వారు అహంకారం కలిగిన వారు అంటూ త్రిష పోస్ట్‌ చేసింది. త్రిష గతంలో రానాతో ప్రేమ వ్యవహారం సాగించింది అంటూ ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు నిజం కాదని, త్రిష కేవలం స్నేహితురాలే అంటూ రానా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

త్రిష తాజాగా చేసిన పోస్ట్‌ ఖచ్చితంగా రానా గురించే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేశారు. నెట్టింట వైరల్‌ అయిన ఆ ట్వీట్‌ వివాదాస్పదం అవుతుందని గ్రహించి వెంటనే త్రిష ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. విషయం గ్రహించిన నెటిజన్స్‌ ఖచ్చితంగా అది రానా గురించి చేసిందే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రానా పెళ్లికి సిద్దం అవుతున్న సమయంలో త్రిష చేసిన ఈ పోస్ట్‌ చర్చనీయాంశం అయ్యింది.

మూడు నాలుగు సంవత్సరాల క్రితం రానా త్రిషల మద్య వ్యవహారం గురించి మీడియాలో చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రానా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా త్రిష హాజరు అయ్యేది. కాని ఇద్దరి ప్రేమ వ్యవహారం అధికారికంగా క్లారిటీ రాకుండానే అప్పుడే బ్రేకప్‌ అయ్యారు. ఆ తర్వాత త్రిష పెళ్లికి సిద్దం అయ్యింది, అది క్యాన్సిల్‌ అయ్యింది. ఇక రానా ఇటీవల మిహిక బజాజ్‌ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఇదే ఏడాది రానా మిహికల వివాహం జరుగబోతుంది. ఇలాంటి సమయంలో త్రిష సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ అయ్యింది.