సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు మళ్లీ అసిస్టెంట్‌గా మారాడట

ఛలో సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ కుడుముల ఆ తర్వాత నితిన్ తో భీష్మ సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఛలో మరియు భీష్మ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమా ల తర్వాత ఏకంగా మెగా హీరో రామ్‌ చరణ్‌ తో పాటు మరో పెద్ద హీరో తో సినిమా చేసే అవకాశం కూడా ఈయన దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా వెంకీ కుడుముల తదుపరి సినిమా విషయంలో ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఆయన తన గురువు త్రివిక్రమ్‌ సినిమాకు సహాయ దర్శకుడిగా మారబోతున్నాడట.

మహేష్ బాబుతో త్రివిక్రమ్‌ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ స్క్రిప్ట్‌ వర్క్‌ లో వెంకీ కుడుముల పాల్గొంటున్నాడు. కేవలం స్క్రిప్ట్‌ విషయంలోనే కాకుండా షూటింగ్‌ సమయంలో కూడా మహేష్‌.. త్రివిక్రమ్ లతో వెంకీ కుడుముల వర్క్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తన సినిమా మొదలు అయ్యే వరకు త్రివిక్రమ్‌ తో సహాయ దర్శకుడిగా ఉంటాడట. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు వెంకీ కుడుముల సహాయ దర్శకుడిగా పని చేశాడు. అందుకే త్రివిక్రమ్‌ ను వెంకీ గురువు గా భావిస్తాడు. అందుకే రెండు సూపర్‌ హిట్‌ లు వచ్చినా ఆయన వద్ద శిష్యుడిగా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు.