జైల్లో మరుగు దొడ్లు కడించారు.. రాములమ్మ ఆవేదన

బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఆమె ఖండించింది. ఖమ్మం జిల్లాకు చెందిన పోడు భూముల వివాదంలో కొందరు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు. జైల్లో అత్యంత దుర్బర జీవితాన్ని గడిపినట్లుగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విజయశాంతి వారి పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు.

విజయశాంతి మాట్లాడుతూ.. పోడు భూముల విషయంలో అటవి శాఖ అధికారులు మహిళలు.. చిన్న పిల్లల తల్లుల అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా వ్యవహరించారు. జైల్లో కూడా పోలీసులు చేయి చేసుకున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా బాత్‌ రూమ్‌ లు కడిగించారు.. మరియు జైల్లో చాలా ఇబ్బంది పెట్టారు అంటూ ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొంది. ఈ వ్యవహారమై జాతీయ బీసీ కమీషన్ విచారణ జరుపుతుంది. ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుని ఆమె విజ్ఞప్తి చేసింది.