వైఎస్ జగన్ బయోపిక్ తో మన ముందుకు రానున్న యాత్ర దర్శకుడు

యాత్ర సినిమాతో అందరినీ ఇంప్రెస్ చేసాడు దర్శకుడు మహి వి రాఘవ్. అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర మంచి విజయాన్ని సాధించింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఈ చిత్రం వల్ల వైఎస్ జగన్ కు మంచి మైలేజ్ లభించిందని చెప్పవచ్చు.

వైఎస్ఆర్సీపి గెలుపులో ఈ సినిమా పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ను తీయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చింది.

ఇటీవలే దర్శకుడు మహి వి రాఘవ్ వైఎస్ జగన్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు అంటే 2023లో వైఎస్ జగన్ బయోపిక్ ను రిలీజ్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. అయితే దర్శకుడి దగ్గర ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.