పక్క రాష్ట్రాలతో స్నేహం నే కోరుకుంటున్నాం : జగన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్బంగా రైతు దినోత్సవం సభను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉన్నంత కాలం రైతుల కోసం ఆలోచించారని ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాల వారితో సఖ్యత కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

రైతు దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో ఉన్న విభేదాల గురించి స్పందించాడు. ప్రతి ఒక్క తెలుగు వారికి ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పక్క రాష్ట్రాలు అన్నింటితో కూడా మంచి స్నేహంను కొనసాగించాలని భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం గురించి డైరెక్ట్‌ గా ప్రస్థావించకుండా పక్క రాష్ట్రాలతో స్నేహం కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పడం కాస్త చర్చనీయాంశంగా మారింది.