వైఎస్సార్‌ బిడ్డలు దొంగలు.. గజ దొంగలు కాదు

తెలంగాణలో వైఎస్సార్‌ కూతురు షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ జయంతి సందర్బంగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఆమె ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సభలో షర్మిల అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. ఈ సందర్బంగా మొదట వైఎస్సార్‌ భార్య విజయమ్మ మాట్లాడారు. ఆమె ఈ సందర్బంగా భావోద్వేగానికి గురి అయ్యారు. వైఎస్సార్‌ బతికి ఉన్నంత కాలం ప్రజల కోసం ఆలోచించారని ఆమె అన్నారు.

విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ పిల్లలు దొంగలు.. గజ దొంగలు కాదని, వారు మాట ఇస్తే దాన్ని నిలుపుకునేందుకు ఎంత దూరం అయినా వెళ్లే సత్తా ఉన్న వారు. షర్మిల కూడా తన తండ్రి నుండే ఆ విషయాన్ని నేర్చుకుంది. కనుక షర్మిలను మీ కుటంబంలో ఒక బిడ్డ అనుకుని ఆమెను ఆధరించండి. ప్రాజెక్ట్‌ లు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. అవన్నీ కూడా వైఎస్సార్‌ హయాంలోనే నిర్మాణం జరిగాయి అంటూ విజయమ్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.