అఖిల్ మీడియాను అవాయిడ్ చేసాడా?

హలో సినిమాకు హీరో అఖిల్, నిర్మాత నాగార్జున కష్టపడినంత మరెవరు కష్టపడి వుండరేమో? వారిద్దరే అన్నింటా అయి తిరిగేసారు. ప్లానింగ్ మొత్తం నాగ్ దే. ట్విట్టర్ హ్యాండిల్ ను నాగ్ చాలా సమర్థంగా వాడుకున్నారు. అఖిల్ రాక్ స్టార్ మాదిరిగా అమెరికాలో విపరీతంగా షోలు కండక్ట్ చేసాడు. విశాఖలో భారీ ఫంక్షన్ చేసారు. హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవిని, రామ్ చరణ్ ను తీసుకురాగలిగారు. అన్ని విధాలా అన్నీ చేసిన తరువాత జస్ట్ మీడియా ముందుకు మాత్రం అఖిల్ రాలేకపోయాడు.

నిజానికి నాగ్-అఖిల్ మీడియా ముందుకు ఈ సాయంత్రం వస్తారని ప్రకటించారు. నాగ్ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓసారి మీడియా ముందుకు వచ్చేసాడు. మరోసారి రానక్కరలేదు. అయితే అఖిల్ ఒక్కడే రావడం ఎందుకున్న ఉద్దేశంతో నాగ్ కూడా ప్లాన్ చేసుకున్నట్లు కనిపించింది. కానీ తీరా చూస్తే ప్రెస్ మీట్ టైమ్ కు అఖిల్ డుమ్మా.

దీనికి నాగ్ కాస్త సుదీర్ఘ వివరణే ఇచ్చాడు. అలసిపోయాడని, మధ్యాహ్నం దాకా లేవలేకపోవడంతో మొహం బాగా పొంగిందని, కన్ను కూడా కాస్త వాచిందని చెప్పుకొచ్చాడు. అంతా బాగానే వుంది. మీడియాకు కావాల్సింది అఖిల్ మాట కానీ, అందం కాదు కదా? మహా అయితే నో ఫొటోస్ ప్లీజ్ అనేయచ్చు. అంతే కానీ ఏకంగా సినిమా విడుదల ముందు రోజు మీడియాతో ఇంట్రాక్షన్ లేకుండా చేసుకోవడం ఏమిటి?

అఖిల్ మీడియాను ఫేస్ చేయడానికి కాస్త జంకాడేమో అన్నగుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ ఫెయిల్యూర్, పెళ్లి ఆగిపోవడం వంటివి అనేక విషయాలు వున్నాయి. ఇప్పుడు మీడియా చాన్నాళ్లకు తమ ముందుకు వచ్చిన అఖిల్ ను ఓ రేంజ్ లో ప్రశ్నలు అడుగుతుంది. అదే కనుక సినిమా సక్సెస్ తరువాత వస్తే క్వశ్చన్లు వేరుగా వుంటాయి. అప్పుడు కూడా కావాలంటే రావచ్చు లేదంటే వదిలేయచ్చు. మొత్తం మీద అఖిల్ కాస్త డిఫరెంట్ నే. చైతూ మాదిరిగా కాదు.