ఇది బిర్యానీ కాదు, గంజి కూడు

తన సినిమాను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని పక్కనపెడితే, ఫస్ట్ తన సినిమా గురించి ఆడియన్స్ ను మెంటల్లీ ప్రిపేర్ చేయడం ఇంపార్టెంట్ అంటున్నాడు మంచు మనోజ్. రెగ్యులర్ గా వస్తున్న తెలుగు సినిమాల్లా తన సినిమాలో కూడా కామెడీ, రొమాన్స్ లాంటివి ఎక్స్ పెక్ట్ చేస్తే ఆశాభంగం తప్పదంటున్నాడు. రేపు రిలీజ్ కాబోతున్న ఒక్కడు మిగిలాడు సినిమా పరమ సీరియస్ మూవీ అంటున్నాడు.

“మా సినిమా చాలా సీరియస్ గా ఉంటుంది. సగటు తెలుగు సినిమాలా అన్ని హంగులు ఇందులో ఉండవు. నిజానికి అసలు వినోదమే ఉండదు. మొత్తం సీరియస్. ప్రేక్షకులకు మేం చెప్పేది ఒకటే. మీరు బిర్యానీ తినట్లేదు. కనీసం ఇది సలాడ్ కూడా కాదు. ఈ సినిమా ఓ గంజికూడుతో సమానం. ఇదే మీరు తినాలి. అలా ప్రిపేర్ అయి రండి.” ఆడియన్స్ కు మంచు మనోజ్ చేస్తున్న విజ్ఞప్తి ఇది.

తన సినిమాలో బ్రహ్మానందం లేదా వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇస్తాడని ఎదురు చూడ్డం వేస్ట్ అంటున్నాడు మనోజ్. సినిమా అంతా చాలా రియలిస్టిక్ గా ఉంటుందని, అలా మానసికంగా సిద్ధమై వస్తేనే తన సినిమా నచ్చుతుందని అంటున్నాడు.