ఓంకార్‌కు కోవిడ్‌ పాజిటివ్‌పై క్లారిటీ

నిన్న మద్యాహ్నం నుండి కూడా సినీ మరియు బుల్లి తెర వర్గాల్లో ప్రముఖ యాంకర్‌, దర్శకుడు ఓంకార్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొంటున్న ఓంకార్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అసలు షూటింగ్స్‌ కొనసాగేనా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయమై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అయిన అశ్విన్‌ మరియు ఇతర కుటుంబ సభ్యులకు కూడా టెస్టు పాజిటివ్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. కాని అవన్ని పుకార్లే అని తేలిపోయింది.

మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని, ఓంకార్‌ కరోనా టెస్టు చేయించుకున్న మాట వాస్తవమే కాని ఆయనకు పరీక్షలో నెగటివ్‌ వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇంట్లో ఎవరికి ఎలాంటి ఆందోళన లేదని, అనుమానంతో మాత్రమే టెస్టులు చేయించాం తప్ప మరేం లేదు అంటూ ఓంకార్‌ ఫ్యామిలీ నుండి క్లారిటీ వచ్చింది. అశ్విన్‌ బాబుకు కూడా పాజిటివ్‌ అనే వార్తలు నిజం కాదన్నారు.

ప్రస్తుతం ఓంకార్‌ ఇస్మార్ట్‌ జోడీ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో షూటింగ్‌లో సోమవారం ఓంకార్‌ పాల్గొనబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఓంకార్‌కు నెగటివ్‌ అంటూ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా సెలబ్రెటీలను ఏ స్థాయిలో భయపెడుతుందో ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు.