చైతన్య పై పడుతున్న నాగ్ సినిమా

చైతన్య నటించిన చందు మొండేటి సినిమా సవ్వసాచి. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మే 24విడుదల డేట్ గా తాత్కాలికంగా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆర్జీవీ-నాగార్జున కాంబినేషన్ లోని ఆఫీసర్ కు కూడా ముహర్తం అధికారికంగా ఫిక్స్ చేసారు. మే 25.మరి మైత్రీ మూవీస్ సంస్థ ఇప్పుడు ఏం చెస్తుంది? తమ సినిమాను నాగ్ కొసం వాయిదా వేసుకుంటుందా? లేదా ఒక రోజు గ్యాప్ వుంది కదా? నాగ్-ఆర్జీవీ సినిమాకు అది సరిపోతుంది అని అనుకుంటుందా?

ఇప్పటిదాకా వినిపిస్తున్న సమాచారం అయితే 24న సవ్యసాచి విడుదల చేయాలనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగ్ కు ఓ మాట చెప్పేసి, ఆయనకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే, 24న విడుదల చేయాలనే మైత్రీ మూవీస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే కనుక భలే రంజుగా వుంటుంది. తండ్రీ కొడుకుల సినిమాలు రెండూ ఒకే రోజు తేడాతో విడుదల కావడం. ఒకదానికి వరుస ఫ్లాపులతో వున్న సీనియర్ డైరక్టర్ మరో దానికి రెండో దానికి వరుస హిట్ లతో వున్న యంగ్ డైరక్టర్. చూడాలి డేట్ విషయంలో ఏం చేస్తారో?