జాను దెబ్బకి ఆ సినిమా అటక ఎక్కించేసాడు!

దిల్ రాజు ఎక్కువగా స్ట్రెయిట్ సినిమాలే చేస్తుంటాడు. కానీ జాను చిత్రాన్ని ముచ్చట పది రీమేక్ చేసాడు. కానీ చేతులు కాలడంతో బాగా నిరుత్సాహపడ్డాడు. కనీసం పింక్ రీమేక్ అయినా వకీల్ సాబ్ అయినా నమ్మకం నిలబెడుతుంది చూస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పటికి వస్తుందో తెలీడం లేదు.

ఇదిలావుంటే దిల్ రాజు బదాయి హో అనే హిందీ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. ముందు చైతన్యతో చేద్దాం అనుకున్నాడు. కానీ అతను ఆసక్తి చూపించక పోవడంతో శర్వానంద్ తో చేద్దామని చూసాడు.

కానీ జాను ఫెయిల్ అవడంతో శర్వాతోనే కాదు, అసలు ఆ రీమేక్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. ఆ చిత్ర,ఎం హక్కుల కోసం పెట్టిన డబ్బులు పోయినా ఫర్లేదు కానీ దానిపై మరిన్ని డబ్బులు పోసి పోగొట్టుకోలేనని ఇలా డిసైడ్ అయిపోయాడు.