తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్

“త్రివిక్రమ్ తో సినిమా అంటే తడిసి మోపెడైపోద్ది” అనేది ఇండస్ట్రీ టాక్. అయితే దీనికి రుజువుల్లేవు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి వ్యతిరేకంగా నిర్మాత నోరు విప్పలేడు. ఇంకెవరూ దీనిపై స్పందించ లేరు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఎలా? ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. స్వయంగా త్రివిక్రమ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

“మామూలుగానే నాకు ఖర్చు ఎక్కువ. మా అమ్మ తిడుతూ ఉండేది. మామూలుగానే ముప్పావలా అయ్యేది రూపాయి చేస్తా. నాకు కొంచెం ఖర్చు ఎక్కువ. కానీ ఇప్పుడు ఖర్చు ఎక్కువ పెడుతున్నప్పటికీ నిర్మాతలు మాత్రం తిట్టడం లేదు. నాకు గడ్డం నెరిసింది కాబట్టి ఊరుకుంటున్నారేమో.”

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో ఇలా అసలు విషయం బయటపెట్టాడు త్రివిక్రమ్. అయితే దేవుడి దయ వల్ల ఇప్పటివరకు తనను నమ్ముకున్న నిర్మాతలు ఎవరూ నష్టపోలేదంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం చేస్తున్న అజ్ఞాతవాసి ప్రాజెక్టు కూడా సేఫ్ గానే ఉందని శెలవిచ్చాడు.

తను రూపాయి అడిగితే, రాధాకృష్ణ రూపాయిన్నర ఇచ్చాడని.. అతడికి థ్యాంక్స్ చెప్పాడు త్రివిక్రమ్. నిర్మాత రాధాకృష్ణతో అజ్ఞాతవాసి కోసం అటుఇటుగా వందకోట్ల రూపాయలు ఖర్చుచేయించాడట త్రివిక్రమ్.