నాగ్ కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడంటే.

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఈపాటికి అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘రాజు గారి గది-2’ రిలీజైపోవాల్సింది. కానీ రెండు నెలల కిందటే ఈ సినిమా పూర్తయినప్పటికీ.. ఔట్ పుట్ విషయంలో నాగార్జున సంతృప్తి చెందకపోవడంతో స్క్రిప్టులో మార్పులు చేసుకుని.. రీషూట్ల మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య తన ప్రతి సినిమా విషయంలో నాగ్ ఇలా ఔట్ పుట్ చూసుకుని రీషూట్లు చేయిస్తుండటం.. అవి బాగానే వర్కవుటతుండటం తెలిసిన సంగతే. రిలీజ్ డేట్ విషయంలోనూ నాగ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కొంచెం ఆలస్యమైనా మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ విషయంలో నాగ్ స్ట్రాటజీ బాగానే వర్కవుటైంది.

‘రాజు గారి గది’ కూడా జులైకే రెడీ అయిపోయేలా ఉన్నా.. ఆగస్టు నెలాఖర్లోనే సినిమాను రిలీజ్ చేయించాలని ఫిక్సయ్యాడు నాగ్. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తారన్నది లేటెస్ట్ అప్ డేట్. ఆగస్టు రెండో వారంలో మూడు సినిమాలు థియేటర్లలోకి దిగేలా ఉన్నాయి. నితిన్ సినిమా ‘లై’.. సాయిధరమ్ తేజ్ మూవీ ‘జవాన్’.. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ‘జయ జానకి నాయక’ ఆగస్టు 11న విడుదవుతాయని అంటున్నారు.

ఈ సినిమాల ప్రభావం రెండు వారాలైనా ఉంటుందని భావించి.. నాగ్ తన చిత్రాన్ని ఆగస్టు 25కు ఫిక్స్ చేసుకున్నాడట. యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు గారి గది-2’ను పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. సమంత.. సీరత్ కపూర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.