పెళ్లి తర్వాత మొదటిసారి సెట్స్ పైకి

పెళ్లి తర్వాత సమంత వెంటనే సెట్స్ పైకి వచ్చేసింది. ఓ తమిళ సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించడంతో పాటు మొన్నట్నుంచి రంగస్థలం మూవీ సెట్స్ పైకి కూడా వచ్చింది. కానీ నాగచైతన్య మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అలా పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న చైతూ ఈరోజు నుంచి సెట్స్ పైకి రాబోతున్నాడు.

సవ్యసాచి మూవీకి సంబంధించి 2 రోజుల పాటు హీరో చైతన్య, హీరోయిన్ నిధి అగర్వాల్ పై ఫొటో సెషన్ చేశారు. నిన్నటితో అది పూర్తయింది. ఇవాళ్టి నుంచి ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.

సవ్యసాచి సినిమా ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా లాంచ్ చేయబోతున్నాడు చైతూ. సవ్యసాచితో పాటు మారుతి సినిమాను కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తాడు. సవ్యసాచి సినిమా యాక్షన్ థ్రిల్లర్ అయితే, మారుతి సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్.