మరో మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడు

ఇప్పటికే నానితో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు నాగార్జున. వీళ్లిద్దరి కాంబోలో ఈనెల 24న ఓ మల్టీస్టారర్ మూవీ ప్రారంభం అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య దీనికి దర్శకుడు. ఇదిలా ఉండగా ఈమూవీతో పాటు మరో మల్టీస్టారర్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా కోలీవుడ్ లో కావడం విశేషం.

స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్. తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రాబోతోంది ఈమూవీ. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారు. స్టోరీ నచ్చడంతో ధనుష్ సినిమాలో నటించేందుకు నాగ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

కథ బాగుంటే ఏ భాషలోనైనా, ఏ హీరోతోనైనా మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి రెడీ అని గతంలోనే ప్రకటించాడు నాగ్. నాగ్ నటించిన ఊపిరి సినిమాలో తమిళ హీరో కార్తి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధనుష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు నాగ్.ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాగార్జున, నానితో చేయబోతున్న మల్టీస్టారర్ మూవీతో పాటు ధనుష్ సినిమాను కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.