వర్మ జీఎస్టీ: ఇకపై పార్ట్-2 కూడా

నిజమే.. అడల్ట్ మూవీ జీఎస్టీకి పార్ట్-2 కూడా వస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా వెల్లడించాడు. ఈసారి మరింత తాత్వికత, భావుకత జోడిస్తానంటున్నాడు.”గాడ్-సెక్స్-ట్రూత్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందుకే దీనికి కొనసాగింపుగా జీఎస్టీ-2ను త్వరలోనే ప్రారంభిస్తాను. నాతో పాటు జీఎస్టీ ప్రేమికులకు దేవుడు అండగా ఉండాలని ఆశిస్తున్నాను.” వర్మ లేటెస్ట్ ట్వీట్ ఇది.

పద్మవాత్ కంటే జీఎస్టీనే చాలా రెట్లు బెటర్ అంటున్నాడు వర్మ. సోషల్ మీడియాలో దీపికా పదుకోన్ కంటే మియా మాల్కోవానే ఎక్కువగా ట్రెండ్ అవుతోందంటూ ట్విట్టర్ లో ఆధారాలు కూడా చూపిస్తున్నాడు. హిపోక్రసీ కంటే నిజాయితీకే ఎక్కువ బలం ఉంటుందన్న వర్మ.. అదే స్పూర్తితో జీఎస్టీ-2ను తీస్తానంటున్నాడు. జీఎస్టీకి వర్క్ చేసిన టీం యాజ్ ఇటీజ్ గా పార్ట్-2కూ పనిచేయబోతోంది. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా.

తాజా ట్వీట్ తో వర్మ పూర్తిగా జీఎస్టీ మాయలో పడిపోయినట్టుగా అనిపిస్తోంది. నాగార్జునతో చేస్తున్న సినిమా గురించి ఈమధ్య కాలంలో ఈ దర్శకుడు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కనీసం ముంబయి షెడ్యూల్ వివరాల్ని గానీ, సినిమా టైటిల్ గురించి గానీ ఒక్క మాట మాట్లాడ లేదు. ఎప్పుడూ వివాదాల వెంట పరుగెత్తే ఈ డైరక్టర్, నాగ్ సినిమాని పూర్తిగా లైట్ తీసుకున్నాడు.