AameKatha Serial December 19th Episode Online 2019

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఆమె కథ’ సీరియల్‌ 33 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 34 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఆమె కథ ఎపిసోడ్‌ హైలైట్స్‌లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

రాణీ వెళ్లిపోతానంటే శ్యామలా దేవి ‘మరో 9 నెలలు దాకా ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లడానికి వీళ్లేదు’ అని ఆదేశిస్తుంది. అదే టైమ్‌లో గౌతమ్ కూడా ‘పక్కకి రా’ అంటూ రాణీకి సైగ చేస్తాడు. అది చూసిన జానకి(పనిమనిషిలా నటిస్తున్న కానిస్టేబుల్) షాక్ అవుతుంది. అయితే రాణీ వెళ్లిపోతుందని ఊహించిన పద్మినీ.. రాణీ వెళ్లకపోయేసరికి.. బాగా ఏడుస్తుంది. అది గమనించిన శ్యామలాదేవి ‘నువ్వు రాణీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ధైర్యం చెబుతుంది. కాసేపటికి పద్మినీ కళ్లు తిరిగి పడిపోవడంతో.. తల్లి కాబోతుందన్న శుభవార్త తెలుస్తుంది. దాంతో గౌతమ్ అన్నీ మరిచిపోయి.. అందరి ముందు పద్మినీని ఎత్తుని తిప్పేస్తాడు. అది చూసిన రాణీ కుళ్లుకుంటుంది.

కొందరికే శుభవార్త!

పద్మిని తల్లి కాబోతుందన్న విషయం తెలియడంతో రాజమాత, గౌతమ్‌లు చాలా హ్యాపీగా ఉంటారు. పద్మినీ కూడా సంతోషిస్తుంది. అంతా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోవడంతో.. వీరేంద్ర(రాజమాతకు మరిది), అతడి భార్య కలిసి.. పద్మినీ దగ్గర నిలబడి, రాని నవ్వును నటిస్తూ.. పద్మీని నవ్విస్తారు. నిజానికి వాళ్లకు కూడా పద్మినీ తల్లికావడం ఇష్టం ఉండదు. రాజకోటకు సంబంధించిన ఆస్తులన్నీ తమకే దక్కాలనే ఉద్దేశంతో అదే కోటలో కుట్రలు చేస్తుంటారు.

గౌతమ్ ప్రేమ?

వీరేంద్ర, అతడి భార్య అక్కడ నుంచి వెళ్లగానే.. అక్కడే కూర్చుని, ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంది పద్మిని. తనకు తెలియకుండా తను చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి, రాణీ ప్రవర్తన గురించి ప్రశ్నార్థకంగా ఆలోచిస్తూ.. విచారంగా కూర్చుంటుంది. ఇంతలో గౌతమ్ చాలా హ్యాపీగా వచ్చి.. ‘ఏంటీ పద్దూ హ్యాపీగా ఉంటావంటే.. ఇలా బాధగా కూర్చున్నావ్? ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావ్?’ అని ఆరా తీస్తాడు. అయితే ఆ విషయాలేమీ చెప్పకుండా.. ‘ఏం లేదండీ.. మనకు పుట్టబోయే బాబుని ఏ స్కూల్‌లో జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నాను’ అంటుంది. తర్వాత గౌతమ్ ప్రేమగా పద్మినీకి పళ్లముక్కలు తినిపిస్తాడు.

లాయర్‌తో రాజమాత మంతనాలు!

రాజమాత దగ్గరకు లాయర్ వస్తాడు. ఏవో డాక్యుమెంట్స్ తిరిగవేస్తూ.. అంతా చెక్ చేస్తుంది రాజమాత. మొత్తానికి లాయర్, రాజమాతలు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అది మొత్తం మ్యూట్‌లో వస్తుంది. ‘ఏది ఏమైనా ఈ సారి న్యాయం మనవైపే ఉంది’ అని లాయర్ రాజమాతతో చెప్పడంతో చాలా సంతోషిస్తుంది రాజమాత. ఇంతలో రాజ గురువు కూడా రావడంతో.. జానకీని పిలిపించి.. కానుకలు తెప్పిస్తుంది. వాటిని గౌరవంతో రాజగురువుకు సమర్పించి.. ‘మీ చలవ కారణంగానే ఇదంతా జరిగింది’ అని రాజగురువుతో అంటుంది రాజమాత. దానికి బదులిచ్చిన రాజగురువు.. ‘అదంతా పద్మిణీ దేవి జాతక బలమేనమ్మా’ అని సెలవిస్తాడు.

జాగ్రత్త సుమా!

‘అమ్మా.. మీకు చెప్పాల్సిందేం లేదు కానీ.. మూడో నెల నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పద్మినీ దేవిగారు జాగ్రత్త. ఎందుకంటే రాజవంశ కోడళ్లు.. గర్భవతులు అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియంది కాదు. జాగ్రత్త’ అని చెప్పి తన శిష్యుడ్ని వెంటపెట్టుకుని వెళ్లిపోతాడు రాజగురువు. అయితే ఆ మాటలకు శ్యామలాదేవి కాస్త నొచ్చుకుంటుంది. అయినా సరే ఆనందంగానే ఉంటుంది.

షాకింగ్ విషయం చెప్పిన జానకి

పోపుల డబ్బాలోంచి చిన్న సెల్ ఫోన్ తీసి.. రిపోర్టర్ వెంకట్‌(రాజకోట వెనుక కథను తవ్వితీసే ప్రయత్నం చేసే వ్యక్తి)కి రహస్యంగా కాల్ చేసి.. ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి వెంకట్ సార్. ఇక్కడ చాలా వింతలు జరుగుతున్నాయి. పద్మిణీ దేవి ప్రస్తుతం కడుపుతో ఉంది. రాజమాత, గౌతమ్ బాబులు చాలా సంతోషంగా ఉన్నారు. రాజగురువులు, లాయర్లు వచ్చి కానుకలు తీసుకుని పోతున్నారు. అయితే రాణీకి, గౌతమ్ బాబుకి ఎఫైర్ నడుస్తోంది. నాకు అనుమానం వచ్చి గౌతమ్ బాబుని ఫాలో చేస్తే నాకు ఈ విషయం తెలిసింది’ అంటూ విషయం మొత్తం చెబుతుంది జానకి.

పద్మినీ జాగ్రత్త!

జానకీ చెప్పిన మాటలకు వెంకట్ షాక్ అవుతాడు. వెంటనే.. ‘నువ్వు జాగ్రత్తగా ఉండటంతో పాటూ పద్మినీని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఎందుకంటే ఆ కోటలో చాలా మందికి పద్మినీ తల్లికావడం ఇష్టం ఉండదు. వాటికి సంబంధించిన విషయాలు నీకు తర్వాత చెబుతాను. కానీ పద్మినీని కనిపెట్టుకుంటూ ఉండు’ అని చెబుతాడు వెంకట్. దాంతో జానకీ ఆలోచనలో పడుతుంది. ‘పద్మినీకి ఆపద తీసుకొచ్చేవాళ్లు ఎవరున్నారు?’ అని తనలో తనే మాట్లాడుకుంటుంది.

భార్యతో సరసాలు!

ప్రేమ స్వచ్ఛమైనప్పుడు ఆ మురిపం చాలా గమ్మత్తుగానే ఉంటుంది. అయితే ఇక్కడ పద్మినీ ప్రేమలో నిజాయితీ ఉంది. నమ్మకం కూడా ఉంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెతో అవసరానికి మాత్రమే కాపురం చేస్తున్నానంటూ ప్రియురాలు రాణీతో గతంలో కూడా ఆల్ రెడీ చెప్పాడు. ‘ఈ పెళ్లి మా అమ్మ కోసమే చేసుకున్నాను’ అన్నాడు. అయితే నటనలో కూడా గౌతమ్ సరసాలను బాగానే పండిస్తున్నాడు. పద్మినిని పూర్తిగా పిచ్చిదాన్ని చేస్తున్నాడు. అప్పట్లో రాణీతో.. ఇప్పుడు పద్మినీతో.. ముద్దులు, మురిపాలు కథని మరింత స్పైసీగా మార్చేస్తున్నాయి. ‘ఈ రేయి తియ్యనిది’ సాంగ్‌కి పద్మినీ, గౌతమ్‌లు రొమాంటిక్ స్టెప్స్‌లతో అదరగొట్టారు. గౌతమ్ చూపించే ప్రేమకు పద్మినీ అతడి వొడిలో ఒదిగి పోతుంది.

శిష్యుడి సందేహం!

రాజ గురువుతో వచ్చిన శిష్యుడు.. గురువుగారితో కారులో వెళ్తూ వెళ్తూ.. ‘గురువు గారూ? నాదో సందేహం. అడగమంటారా?’ అంటాడు. ‘అడుగు నాయనా’ అని రాజగురువు అనుమించగానే.. ‘గురువుగారూ.. గౌతమ్ బాబుకి జాతకరీత్యా ఎన్నో దోషాలు ఉన్నాయి కదా.. ఆ రాజకోటకు ఎన్నో శాపాలు ఉన్నాయి కదా.. మరి పద్మినిదేవి గర్బం దాల్చడంతో అవన్నీ తొలగిపోయినట్లేనా?’ అని ప్రశ్నిస్తాడు. దాంతో రాజగురువు ‘లేదు నాయనా.. పద్మిణీ దేవి… ఇప్పుడే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉంది. మరి బయటికి వస్తుందో లేదో దేవుడే తేల్చాలి’ అంటారు.

శ్యామలా దేవి ఆవేశం

రాజకోటలో రహస్యగదిలోకి పద్మిణీ చూడకుండా వెళ్లిన రాజమాత.. ‘నేను గెలవబోతున్నాను.. ఇక నీ ఆటలు సాగవు. ఈ కోటకు వారసుడు రాబోతున్నాడు. నువ్వు దీన్ని ఆపలేవు’ అంటూ అరుస్తుంది. అక్కడ ఓ స్త్రీ వికట అట్టహాసపు నవ్వులు చాలా భయాన్ని కలిగిస్తుంటాయి. అక్కడ ఉన్న ఓ ఊయలని చూసిన శ్యామలా దేవి.. చాలా పెద్దగా వస్తున్న చంటిపిల్లల ఏడుపుని వింటూ చెవులు మూసుకుంటుంది. వెంటనే.. ‘దీన్ని ఉండనివ్వను నేను.. దీన్ని చూస్తుంటే ఎన్నో అశుభాలు గుర్తుకొస్తున్నాయి’ అంటూ కాల్చి బూడిద చేస్తుంది. ఆ వింత శబ్దాలు కింద కూర్చున్న పద్మినికి వినిపించి.. పైకి వెళ్తుంది. సరిగ్గా పద్మినీ వెళ్లే సరికి శ్యామలాదేవి ఎదురు వచ్చి.. ‘నీకు కొన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఆ గదిలోకి వెళ్లొద్దు’ అంటూ సున్నితంగానే చెప్పి వెనక్కి పంపించేస్తుంది.

రాణీ గదిలోకి గౌతమ్

వెంకట్ మాట్లాడిన తర్వాత.. పద్మినితో నిజం చెప్పడానికి వస్తుంది. ‘పద్మినీ అమ్మ చాలా మంచిది. పాపం తను చాలా ప్రమాదాల్లో ఉంది. కానీ గౌతమ్ బాబు మంచివాడు కాదని నిజం చెప్పేయ్యాలి’ అనుకుంటూ జరిగింది తలుచుకుంటుంది. (రాణీ ఇళ్లు వదిలి వెళ్తానని రాజమాతతో చెప్పినప్పుడు.. గౌతమ్ ‘పక్కకు రా ’ అని గౌతమ్ రాణీకీ సైగ చేయడం చూసిన జానకీ వాళ్లని ఫాలో చేస్తుంది. గౌతమ్ రాణీ గదిలోకి వెళ్లి.. రాణీని ఒప్పించడం, బతిమలాడటం చాటుగా చూస్తుంది జానకి. ‘రాణీ నువ్వు లేనిదే నా ప్రాణమే లేదని నీకు చెప్పాను కదా? మరి నువ్వు ఎందుకు ఇలా బెట్టు చేస్తున్నావ్.? పద్మినీని ఎందుకు పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు కదా?’ అంటూ గౌతమ్ రాణీతో చెప్పిన మాటలన్నీ తలుచుకుంటూ ఆలోచనలో పడుతుంది.

పద్మినీ ఏం అయిపోతుంది?

‘గౌతమ్ బాబు గురించి చెప్పేద్దాం..’ అనుకుంటూ పద్మినీ దగ్గరకు వచ్చిన జానకీ.. ‘ఇప్పుడు నేను నిజం చెప్పేస్తే పద్మినీ జీవితం ఏం అయిపోతుంది? అసలు నేను నిజం చెబితే పద్మిణీ తట్టుకోగలదా? చెబితే జాగ్రత్త పడుతుందేమో కదా? చెప్పడం వల్ల తను ఎలా రియాక్ట్ అవుతుందో? కడుపుతో ఉన్నవాళ్లకి షాకింగ్ న్యూస్ చెప్పడం మంచిది కాదు కదా?’ అంటూ తనలో తనే ఆలోచించుకుంటుంది.

కమింగ్ అప్‌లో..

గౌతమ్, పద్మినీలు పడుకుని ఉండగా.. గౌతమ్.. కలవాట్లు పలుకుతాడు. ‘సుహాసినీ.. సుహాసినీ’ అంటూ పిలుస్తూ.. కలలోనే ఇబ్బంది పడుతూ ఉంటాడు. గౌతమ్ కలవాట్లకు మేలుకున్న పద్మినీ.. ‘సుహాసినీ’ పేరు విని షాక్ అవుతుంది. ‘సుహాసినీ ఎవరు?’ అని ఆలోచిస్తూ.. ఆందోళనగా గౌతమ్ వైపు చూస్తుంది. అయితే రాజమహల్ రహస్యాల గురించి ఆరాలు తీస్తున్న రిపోర్ట్ వెంకట్ వెతుకుతున్న అమ్మాయి పేరు సుహాసిని. నిజానికి పద్మినీలానే గౌతమ్ సుహానీని పెళ్లి చేసుకుని రాజకోటలకు తెచ్చాడని వెంకట్ మొదట్లో అనుమానించాడు. అయితే గౌతమ్ జీవితంలో సుహాసినీ అనే మరో అమ్మాయి కూడా ఉంది. ఒకవైపు రాణీతో ప్రేమకలాపాలు సాగిస్తూనే.. తన వంశం కోసమో.. తన ఆకాంక్ష కోసమో ఆడదాని జీవితంతో గౌతమ్ ఆడుకుంటున్నాడు. అసలు కథ ఏమిటో వేచి చూడాల్సిందే. ఆమె కథ కొనసాగుతోంది.