‘మిస్టర్’ కథని అల్లు అర్జున్ కోసం రాసుకున్నానని శ్రీను వైట్ల చెప్పాడు. బ్రూస్లీ తర్వాత అల్లు అర్జున్తో చేద్దామని శ్రీను వైట్ల ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు. కానీ అప్పటికే అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి వుండడంతో శ్రీను వైట్ల చెప్పిన కథ నచ్చినప్పటికీ రిజెక్ట్ చేసాడట. అతను రిజెక్ట్ చేసిన తర్వాత ఈ కథకి యాప్ట్ ఎవరనేది ఆలోచించి వరుణ్ తేజ్తో చేయాలని డిసైడ్ అయ్యాడట.
మిస్టర్ చిత్రం తనకి కొత్త ఇమేజ్ని తీసుకొస్తుందని, రెడీ ఏ విధంగా అయితే ట్రెండ్ సెట్టర్ అయిందో, ఇది కూడా అలాగే ఒక కొత్త ట్రెండ్కి శ్రీకారం చుడుతుందని, ఈ చిత్రం తర్వాత ట్రావెల్ నేపథ్యంలో చాలా కథలు పుట్టుకొస్తాయని శ్రీను వైట్ల కాన్ఫిడెంట్గా వున్నాడు. ట్రెయిలర్లో చెప్పుకోతగ్గ కామెడీ లేదనే విమర్శలని కూడా వైట్ల పట్టించుకోవడం లేదు.
ఈ చిత్రంలో చాలా మంచి కామెడీ వుంటుందని, ఇంతకుముందు చూసినట్టుగా సెపరేట్ ట్రాక్లు కాకుండా కథలో భాగమై వినోదం వుంటుందని చెప్పాడు. శుక్రవారం రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం శ్రీను వైట్ల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. తారాపథంలోకి వెళ్లిన దర్శకుడు రెండు పరాజయాలతో స్టార్ హీరోలకి పూర్తిగా దూరమైపోయాడు.
ఇప్పుడీ చిత్రంతో హిట్టు కొడితే తప్ప మళ్లీ అతడిపై స్టార్ హీరోలకి నమ్మకం కలగదు. మరి ఈ కథని రిజెక్ట్ చేసిన బన్నీ జడ్జిమెంట్ రైటో, ఇది బెస్ట్ అని డిసైడ్ అయి ముందుగా దీనిని కంప్లీట్ చేసిన వరుణ్ తేజ్ కరక్టో శుక్రవారం తేలిపోతుంది.