ఖైదీ దెబ్బకి బోయపాటి మందు

‘ఖైదీ నంబర్‌ 150’లో రత్తాలు పాటని లాస్ట్‌ మినిట్‌లో పోగొట్టుకున్న క్యాథరీన్‌కి దాంతో చాలా నష్టమే జరిగింది. ఆమె కాండక్ట్‌పై బ్యాడ్‌ రిపోర్ట్‌ ఇండస్ట్రీ అంతా పాకిపోయింది. తలపొగరు అని, చిరంజీవి సినిమా అనేది కూడా చూడకుండా సెట్లో తలబిరుసుగా వ్యవహరించిందని, లారెన్స్‌ అంతటి సీనియర్‌తో కయ్యం పెట్టుకుందని క్యాథరీన్‌ గురించి ఠాం ఠాం అయిపోయింది.

ఇదే సమయంలో ఒక తమిళ చిత్రంలోను వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన క్యాథరీన్‌కి ఛాన్సులే కరవైపోయాయి. సరైనోడు తర్వాత బిజీ అయిపోతుందని అనుకున్న అమ్మడికి ఖైదీ ఛాన్స్‌ మిస్‌ చేసుకోవడం మైనస్‌గా మారింది. ఇలాంటి టైమ్‌లో క్యాథరీన్‌కి మళ్లీ సరైనోడు దర్శకుడు బోయపాటి శ్రీను బ్రేక్‌ ఇస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో తీస్తోన్న అల్లుడు బంగారం చిత్రంలో క్యాథరీన్‌తో స్పెషల్‌ సాంగ్‌ చేయిస్తున్నాడు.

ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు కాకుండా మళ్లీ ప్రత్యేక గీతానికి క్యాథరీన్‌ని పెట్టుకున్నారు. ఈ చిత్రంలో గ్లామర్‌ విందుకి లోటు జరగకుండా బోయపాటి సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇంతవరకు స్టార్‌ హీరోలతో చేస్తూ వచ్చిన బోయపాటి ఒక యువ హీరోని ఎలా హ్యాండిల్‌ చేసాడనేదాని కోసం బిజినెస్‌ వర్గాలతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.