ప్రభాస్‌ 21 : బాబోయ్‌ దీపిక అంత డిమాండ్‌ చేసిందా?

ప్రభాస్‌ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్‌ 21వ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఒక వైపు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేస్తూనే మరో వైపు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రం కోసం హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ లో తెరకెక్కిస్తున్న కారణంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ను నటింపజేయాలని భావిస్తున్నారు. అందుకోసం పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలతో నాగ్‌ అశ్విన్‌ చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా దీపిక పదుకునే విషయం సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రభాస్‌తో కలిసి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నటించేందుకు దీపిక పదుకునే ఏకంగా 15 కోట్ల రూపాయలను డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఈమె నటించే సినిమాలకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇది సౌత్‌ సినిమా కనుక అందులోనూ ఎక్కువ డేట్లు అడుగుతున్నారు కనుక ఈ భారీ మొత్తంను ఆమె డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి నాగ్‌ అశ్విన్‌ అంతటి పారితోషికం ఇచ్చి ఆమెను ఈ చిత్రంలో నటింపజేస్తాడా అనేది చూడాలి.