మహిళా దినోత్సవం స్పెషల్.. కొడుకు ఫొటో పోస్ట్ చేసిన కరీనా కపూర్

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఇటివలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఇప్పటివరకు తన కుమారుడిని అభిమానులకు చూపించలేదు. ఎప్పుడెప్పుడు కరీనా తన బిడ్డను చూపిస్తుందో అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు కరీనా చెక్ పెట్టింది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తన బిడ్డను పరిచయం చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన కొడుకును ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.

మహిళకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. అయితే.. అతడి ముఖం కనిపించకుండా ఆ ఫోటో ఉంది. కుమారుడ్ని తన భుజాలపై పడుకోబెట్టుకుని ఉంది కరీనా. బాబు ముఖం చూపించు కరీనా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయినా.. కరీనాకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఫ్యాన్స్. సైఫ్, కరీనా దంపతులకు 2016లో మొదటి కొడుకు తైమూర్ జన్మించాడు.