తన లవ్ ట్రాక్ ని మరింత కన్ఫర్మ్‌ చేసిన హాట్ బ్యూటీ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో మునిగి తేలింది. ఆ తర్వాత రణబీర్ కపూర్‌ తో ప్రేమాయణం సాగించింది. కొన్ని కారణాల వల్ల ఇద్దరితో బ్రేకప్‌ అయ్యింది. కొంత కాలం సింగిల్ గానే ఉన్న కత్రీనా గత ఏడాది కాలంగా బాలీవుడ్ యంగ్‌ స్టార్‌ హీరో విక్కీ కౌశల్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరి గురించి బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాని వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయంలో మౌనం వహిస్తూ వస్తున్నారు.

తాజాగా కత్రీనా కైఫ్‌ పోస్ట్‌ తో ఇద్దరి మద్య వ్యవహారం కొనసాగుతుందని క్లారిటీ వచ్చేసింది. విక్కీ కౌశల్‌ పుట్టిన రోజు సందర్బంగా కత్రీనా ఇన్ స్టా లో అతడు ఆర్మీ జవాన్ లతో బోర్డర్‌ లో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసి నీవు జీవితాంతం ఇలాగే ఆనందంగా నవ్వుతూ ఉండాలంటూ పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ ప్రస్తుతం నెటిజన్స్‌ ను ఆకర్షిస్తుంది. ఇద్దరి జోడీ చాలా బాగుంటుందంటూ కామెంట్స్ వస్తున్నారు. ఇద్దరి వయసు తేడా కూడా అతి తక్కువ. కనుక ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి విక్కీతో అయినా కత్రీనా రిలేషన్‌ లాంగ్‌ లైఫ్‌ కొనసాగుతుందేమో చూడాలి.