నాగబాబు బొమ్మ అదిరింది.. ఇదేదో కాట్రవల్లీ అంటోన్న అలీ

జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసాక నాగబాబు జీ ఛానల్ లో ప్రసారమవుతోన్న అదిరింది షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అదిరింది షో కు టైటిల్ మార్చి బొమ్మ అదిరింది గా చేసారు. నాగబాబుతో పాటు జడ్జిగా చేస్తున్న నవదీప్ ను తప్పించి జానీ మాస్టర్, కమెడియన్ అలీలను తీసుకొచ్చారు. ఇక యాంకర్ లుగా రవి, భాను ఉండేవారు. ఇప్పుడు వీరి స్థానంలో శ్రీముఖి వచ్చింది.

ఈ షో కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ నాగబాబు గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. “420 సినిమా చేస్తున్న సమయంలో నాగబాబు ఒక కీబోర్డు తీసుకొచ్చారు. అన్నయ్య ఇచ్చారు అని చెప్పారు. ఇది సింగపూర్ నుండి వచ్చింది. ఇది నేను ముందే నేర్చుకున్నా తెలుసా అని అన్నారు. దీంతో నేను ఆశ్చర్యపోయి అలా ఎలా అన్నా అన్నాను. బై బర్త్ రా అన్నారు నాగబాబు. నేను ఇంకోటి వాయించన్నా అన్నారు. ఆయన ఒక స్విచ్ నొక్కారు. ఉత్తి వెళ్లే కదులుతున్నాయి తప్ప అక్కడేం లేదు, ఇదేదో కాట్రవల్లి” అని స్టేజ్ మీదే అనేసారు అలీ.

ఇది కామెడీ కోసమే చేసిన ప్రయత్నంగా అనిపిస్తోంది. బొమ్మ అదిరింది, జబర్దస్త్ కు పోటీగా వచ్చినా దేని హవా దానిదే అన్నట్లుగా ఉంది. రీసెంట్ గా ఈ షో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అనుకరిస్తూ చేసిన స్కిట్ కారణంగా వివాదాల్లో నిలిచిన విషయం తెల్సిందే.