కొత్త కోణం: శిరీష లోదుస్తుల‌పై మ‌ర‌క‌లు?

రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం రేపిన బ్యూటీషియ‌న్ శిరీష అనుమానాస్ప‌ద మృతి ఇప్పుడు మ‌రిన్ని అనుమానాలు పెంచేలా ఉన్నాయి. మొద‌ట ఆమె మృతిని అనుమానాస్ప‌దం అన్న పోలీసులు ఆ త‌ర్వాత‌.. ఆమెది ఆత్మ‌హ‌త్య‌గా ఖ‌రారు చేయ‌టం తెలిసిందే. ఆమె మృతికి సంబంధించిన విషయాల్ని పూస‌గుచ్చిన‌ట్లుగా చెప్పిన పోలీసులు అధికారులు..ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ సూసైడ్‌గా తేల్చారు.

అయితే.. ఆమె లోదుస్తుల‌ను ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల‌కు పంపిన‌ట్లుగా వెల్ల‌డించారు. ఇదిలాఉంటే.. ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి భిన్నంగా శిరీష మ‌ర‌ణించిన స‌మ‌యంలో ఆమె ధ‌రించిన లోదుస్తుల‌పై మ‌ర‌క‌ల్ని గుర్తించిన‌ట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్ర‌స్తావించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

కోర్టుకు స‌మర్పించిన రిపోర్ట్‌లో శిరీష లోదుస్తుల‌పై మ‌ర‌క‌లు ఉన్న‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు.అ యితే.. ఆమె లోదుస్తుల‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామ‌ని.. ఆ రిపోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత క‌చ్ఛితంగా విష‌యాలు తెలుస్తాయ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. బ్యూటీషియ‌న్ శిరీష‌కు.. ఆమె ప‌ని చేసే ఆర్‌జే ఫోటో స్టూడియో య‌జ‌మాని రాజీవ్‌ల‌కు వివాహేత‌ర సంబంధం ఉండ‌టం.. అదే వ్య‌క్తికి మ‌రో ఐటీ ఉద్యోగినితో ల‌వ్ ఎఫైర్ ఉండ‌టంతో వీరికి సంబంధించిన పంచాయితీని కుకునూరుప‌ల్లి ఎస్ఐ ద‌గ్గ‌ర తేల్చుకునేందుకు శిరీష‌.. రాజీవ్‌.. వీరి స్నేహితుడు శ్ర‌వ‌ణ్‌లు వెళ్ల‌టం తెలిసిందే.

అక్క‌డ ఎస్ఐ.. శిరీష విష‌యంలో కొంత ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఆమె అందుకు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో తిరిగి వ‌చ్చేసిన‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు. అనంత‌రం శిరీష ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం తెలిసిన విష‌యాలే. ఈ వ్య‌వ‌హారంలో రాజీవ్‌.. శ్ర‌వ‌ణ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టుకు స‌మ‌ర్పించిన రిమాండ్ నోట్‌లో శిరీష లోదుస్తుల‌కు మ‌ర‌క‌ల విష‌యంతో పాటు.. శ్ర‌వ‌ణ్‌కు సంబంధించిన కొత్త విష‌యాల్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

శిరీష కేసులో ఏ1గా ఉన్న శ్ర‌వ‌ణ్ గ‌తంలో ప‌లుమార్లు కుకునూరుప‌ల్లి ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డికి అమ్మాయిల‌ను పంపేవాడ‌ని పేర్కొన్నారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం శిరీష‌ను తీసుకెళ్ల‌టానికి ముందే ఆమె ఫోటోల‌ను ఎస్ఐకి వాట్సాప్ లో పంప‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు.. శిరీష‌ను తీసుకెళ్ల‌టానికి ముందు ఎస్ఐతో జ‌రిగిన ఫోన్ కాల్‌లో శిరీష అందం గురించి శ్ర‌వ‌ణ్ చెప్పిన‌ట్లుగా రిమాండ్ నోట్‌లో పేర్కొన‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.