ఎన్టీఆర్ మలి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడనేది తెలిసిందే. పట్టుబట్టి మరీ త్రివిక్రమ్తో సినిమా ఓకే చేయించుకున్నాడు ఎన్టీఆర్. నిజానికి జై లవకుశ కంటే ముందే నాలుగు నెలల్లో ఒక సినిమా చేసేద్దామని త్రివిక్రమ్ వెంట పడ్డాడు ఎన్టీఆర్.
అది కుదర్లేదు కానీ నెక్స్ట్ మూవీ చేస్తానని త్రివిక్రమ్ మాటిచ్చాడు. అయితే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ కథ ఎప్పుడు రాస్తాడు, పవన్ సినిమా అయిన ఎన్నాళ్లకి దీనిని మొదలు పెడతాడు అని యంగ్ టైగర్ ఫాన్స్ ఉత్కరఠగా చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ చిత్రానికి త్రివిక్రమ్ కథ ఆల్రెడీ ఓకే అయిపోయిందట. మహేష్ కోసమని త్రివిక్రమ్ ఒక కథ రెడీ చేసుకున్న సంగతి తెలిసిందే. అది ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వస్తోంది. ఆ కథకి తనకి కావాలంటూ ఎన్టీఆర్ పట్టుబట్టాడట.
మహేష్ ఇమేజ్కి తగ్గ కథ అని త్రివిక్రమ్ చెప్తే, ఇప్పుడు తాను కూడా అదే తరహా చిత్రాలు చేస్తున్నానని, తనతో ఫ్యామిలీ చిత్రమే చేయాలని అనుకుంటున్నానని, మాస్ చిత్రం వద్దని చెప్పాడట. అలా మహేష్తో త్రివిక్రమ్ చేద్దామనుకున్న కథ ఇప్పుడు ఎన్టీఆర్తో సెట్ అయినట్టు గుగగుసలు వినిపిస్తున్నాయి.