డీజేకి పీకే హీటు తప్పదు

‘చెప్పను బ్రదర్‌’ కాంటవ్రర్సీతో పవన్‌ ఫాన్స్‌కి విలన్‌ అయిపోయిన అల్లు అర్జున్‌కి తమ సత్తా చూపించాలని పవన్‌ సేన సిద్ధమవుతోంది. ‘దువ్వాడ జగన్నాథమ్‌’ వేడుకల్లో పవన్‌కళ్యాణ్‌ నినాదాలతో హోరెత్తించడానికి ఒక గ్రూప్‌ సిద్ధమవుతోందట. అయితే ఈ వేడుకల్లో పవన్‌ ఫాన్స్‌ రాకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఈ కార్యక్రమానికి ఇచ్చే పాసులకి హోలోగ్రామ్‌లు వేయించి సెక్యూరిటీ ఫీచర్స్‌ పెంచుతున్నారట. బయటకి వెళ్లే ప్రతి పాస్‌ ఎవరికి వెళ్లింది, ఎవరు వచ్చిందీ నోట్‌ చేసుకుంటారట. ఇది చాలా క్లిష్టమైన ప్రాసెస్‌ అయినప్పటికీ హీరోని ఇబ్బందికర పరిస్థితిలో పెట్టకుండా వుండేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని భోగట్టా. మరోవైపు ఇలాంటి పబ్లిక్‌ వేడుకలకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అని నిర్దేశించడం కుదరదు.

ఒకసారి పాస్‌లు చేతులు మారాక అవి ఎవరి చేతికి వెళ్లి ఎవరు ఆడిటోరియంలో అడుగు పెడతారనేది ట్రాక్‌ చేయడం చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లో డీజెకి పీకే హీటు చూపించాలని చూస్తోన్న పవన్‌ ఫనటిక్స్‌ ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో ఆడిటోరియంలోకి వెళ్లిపోతారు. అల్లు అర్జున్‌ తప్ప దర్శకుడు, నిర్మాతతో సహా అక్కడ వుండే మిగతా వాళ్లంతా పవన్‌ ప్రస్తావన తీసుకువచ్చినా అడ్డు చెప్పే వాళ్లు కాకపోవడం అడ్వాంటేజ్‌ అవుతుంది.