శర్వానంద్, పవన్ ను ఢీకొట్టబోతున్నాడా?

శర్వానంద్ నటించిన ఫ్యామిలీ డ్రామా ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫిబ్రవరి 25కి విడుదల షెడ్యూల్ అయిన విషయం తెల్సిందే. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఆ డేట్ కు రిలీజ్ అనౌన్స్మెంట్ చేసుకున్నా కానీ ఆ చిత్రం వాయిదా పడుతుందన్న ఉద్దేశంతో శర్వానంద్ ఫిబ్రవరి 25నే తన చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.

అయితే సడెన్ గా భీమ్లా నాయక్ 25కే వస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శర్వానంద్ పక్కకు తప్పుకుంటాడని అందరూ భావించారు. అయితే శర్వానంద్ కూడా వెనక్కి తగ్గట్లేదు. తన చిత్రం అనుకున్న తేదీకే వస్తుందని అంటున్నాడు.

19వ తారీఖు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాడు. మరి శర్వాకు ఉన్న ధైర్యమేంటి? భీమ్లా నాయక్ తో ఎందుకు పోటీకి వెళ్తున్నట్లు?? ఆడవాళ్ళూ మీకు జోహార్లు వాయిదా పడదా?