కాటమ రాయుడు చిత్రంలో చాలా కామెడీగా కనిపించిందంటూ ట్రోలింగ్కి గురయిన శృతిహాసన్కి అక్కడి నుంచి అన్నీ చేదు వార్తలే వినిపిస్తున్నాయి. కష్టపడి కత్తి సాము నేర్చుకున్న తర్వాత ఆమెని సంఘమిత్ర చిత్రం నుంచి తప్పించారు. బెహన్ హోగీ తేరీ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టడంతో శృతిహాసన్ మరింత డీలా పడింది. ఈ చిత్రం తనకి నటిగా మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తే, సినిమాకి మైనస్సే శృతి అని విమర్శకులు తేల్చేసారు.
అసలే కొత్త అవకాశాలు లేని శృతికి ఇంకో ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాణంలో వున్న ఆమె హిందీ చిత్రం ‘యారా’ ఆగిపోయింది. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఈ చిత్రాన్ని ఆ నిర్మాతలు ఫైనల్గా కాల్ ఆఫ్ చేసారు. ఇందులో విద్యుత్ జమావాల్ హీరోగా నటిస్తున్నాడు. యాభై ఏళ్ల వృద్ధుడిగా కనిపించడం కోసం పాపం చాలా కష్టపడ్డాడు. అతని దురదృష్టమో, శృతి బ్యాడ్ టైమో కానీ యారా ఆగిపోయింది.
ప్రస్తుతం శృతి చేతిలో తన తండ్రి దర్శకత్వంలో చేస్తోన్న శభాష్ నాయుడు తప్ప ఇంకో సినిమా లేదు. శభాష్ నాయుడు కూడా చాలా కాలంగా నిర్మాణ దశలోనే వుంది. అది ఎప్పటికి రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. అది రిలీజ్ అయి హిట్ అయితే తప్ప శృతిని మళ్లీ చిత్ర పరిశ్రమ పట్టించుకునే ఛాయలు కనిపించడం లేదు. ఈ టైమ్ గ్యాప్లో శృతి తన విదేశీ బాయ్ఫ్రెండ్తో దేశాలు చుట్టేస్తోంది.