నిర్మాతగా సుధీర్ బాబు

ఘట్టమనేని వారి అల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి, తనకంటూ ఓ ప్లేస్ కోసం విభిన్న ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు సుధీర్ బాబు. తెలుగులో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, బాలీవుడ్ లో విలన్ గా మారి ఇలా డిఫరెంట్, డిఫరెంట్ అటెంప్ట్ లు చేస్తున్నాడు. త్వరలో బాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్ బయోపిక్ లో మెయిన్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఈలోగానే డైరక్టర్ ఇంద్రగంటి సినిమా ఒకటి ఒకె చేసాడు.

ఇవన్నీ ఇలా వుండగానే తానే నిర్మాతగా ఓ సినిమాను గప్ చుప్ గా 60శాతం ఫినిష్ చేసేసేడట. చిత్రమేమిటంటే, ఇంకా బ్యానర్ పేరు లేదు, సినిమా టైటిల్ లేదు. సినిమా మాత్రం చకచకా లాగించేస్తున్నాడు.

రామానాయుడు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి వచ్చి, సురేష్ బాబు క్యాంపులో అనుభవం సంపాదించిన నాయుడు అనే కొత్త దర్శకుడు తెచ్చిన మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ సబ్జెక్ట్ నచ్చి సుధీర్ బాబు స్వంత సినిమా నిర్మాణం స్టార్ట్ చేసాడట.

ఇప్పటి వరకు సుదీర్ ఎన్ని సినిమాలు చేసినా, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టోరీ చేయలేదు. అందుకే ఈసారి ఈస్వంత ప్రయత్నం అని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఏ మాయె చేసావె’ లాంటి పవర్ ఫుల్ టైటిల్ కోసం వెదుకుతున్నారట.