శ్రీదేవి కూతురు జాహ్నవి, తెలుగు సినీ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోందట.. అంటూ ఒకప్పుడు చాలా గాసిప్స్ విన్పించాయి. చరణ్, జాహ్నవి కాంబినేషన్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయడానికి అప్పట్లో చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆ ప్రయత్నాలేవీ కార్యరూపం దాల్చలేదు.
తన కుమార్తె సినీ రంగప్రవేశం విషయమై శ్రీదేవి బీభత్సమైన సస్పెన్స్ మెయిన్టెయిన్ చేసింది. ఎట్టకేలకు శ్రీదేవి, తెరంగేట్రానికి రంగం సిద్ధమయ్యింది ‘ధడక్’ పేరుతో సినిమా అనౌన్స్ అయిపోయింది. ఇక, ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెలుగులోనూ నటిస్తుందా.? నటించదా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే. ఈ ప్రశ్నకు సమాధానంగా, ‘ఎస్.. వైనాట్ టాలీవుడ్.. తెలుగులోనూ జాహ్నవి సినిమాలు చేస్తుంది..’ అంటూ శ్రీదేవి క్లారిటీ ఇచ్చేసింది.
అయితే, ఇక్కడో చిన్న కండిషన్స్ అప్లయ్ వుందండోయ్. తొలి సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాకే, ఇతర భాషల గురించి ఆలోచించాల్సి వుంటుందని శ్రీదేవి చెప్పుకొచ్చింది. ‘మంచి కథలు దొరకాలి, మంచి కాంబినేషన్స్ సెట్ అవ్వాలి..’ అంటూ కండిషన్స్ లిస్ట్ చెబుతోంది శ్రీదేవి. శ్రీదేవి ఓకే అనాలేగానీ, ఆమె కుమార్తె జాహ్నవితో సినిమా చేయడానికి టాలీవుడ్ నుంచి కాంబినేషన్లు, కథలు.. పెద్ద విషయమా.? కానే కాదు.
హిందీలో రీ-ఎంట్రీ ఇచ్చింది.. తమిళంలోనూ నటించింది.. తెలుగు మీదనే శీతకన్నేసింది శ్రీదేవి కూడా. అలాంటి శ్రీదేవి, తన కుమార్తెను టాలీవుడ్లోకి తీసుకొచ్చే అవకాశముందా.? వేచి చూడాల్సిందే.