పిక్‌ టాక్‌: ఈమెని గుర్తు పట్టగలరా?

రక్షిత… ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ అంటూ రవితేజ వెంటపడి పాటేసుకున్న హీరోయిన్‌. నాగార్జున, మహేష్‌లాంటి అందగాళ్ల సరసన నటించిన హీరోయిన్‌. ఇప్పుడు గుర్తు పట్టలేకుండా తయారైంది. స్థూలకాయంతో బాధ పడుతూ సినిమాలకి పూర్తిగా దూరమైన రక్షిత ఇప్పటికీ అనారోగ్యాన్ని జయించలేకపోయింది. రక్షిత లేటెస్ట్‌ ఫోటో ఇది.

ఈమె ఫలానా అంటూ చెప్పినా కానీ నమ్మలేనట్టుగా అయిపోయింది. కన్నడ దర్శకుడు ప్రేమ్‌ని పెళ్లాడిన రక్షిత ఆ తర్వాత అతని దర్శకత్వంలో రెండు సినిమాలు నిర్మించింది. అయితే ఇప్పటికీ సగటు హీరోయిన్‌లానే గ్లామరస్‌గా రెడీ అయి రావడం మెచ్చుకోతగ్గ విషయం. మామూలుగా ఇలా అయినపుడు స్టార్‌బిజ్‌లో వున్నవాళ్లు ఈజీగా డిప్రెస్‌ అవుతారు. కానీ రక్షిత తనలో వచ్చిన మార్పుల గురించి అంతగా కలత చెందకుండా హ్యాపీగా పబ్లిక్‌ ఈవెంట్స్‌కి హాజరవుతోంది.